దొడ్డు ధాన్యం రైతులకు సున్నమే

83చూసినవారు
దొడ్డు ధాన్యం రైతులకు సున్నమే
తెలంగాణాలో వానకాలమైనా, యాసంగి అయినా దొడ్డు వడ్లే ఎక్కువ సాగవుతాయి. సన్నవడ్ల సాగు తక్కువ ఉంటుంది. అదీ కొన్ని ప్రాంతాలకే పరిమితం. సాధారణంగా వానకాలంలో 30-40శాతం సన్నాలు, 60-70శాతం దొడ్డు వడ్లను రైతులు సాగు చేస్తారు. యాసంగిలో సన్నాలు కేవలం 10-15శాతం, దొడ్డు వడ్లు 90శాతం సాగవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో సన్న వడ్లకే బోనస్‌ ఇస్తామంటే దొడ్డు వడ్లు పండించే రైతుల పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

సంబంధిత పోస్ట్