ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ అనుపమ్ నగర్లో జులై 12న షాకింగ్ ఘటన జరిగింది. ఓ వైద్యుడి ఇంటికి డెలివరీ బాయ్ వచ్చాడు. అతడిపై పిట్బుల్ జాతికి చెందిన డాక్టర్ పెంపుడు కుక్కలు దాడి చేశాయి. తీవ్రంగా కరిచాయి. తలుపు తట్టిన వెంటనే మెరుపు వేగంగా ఆ కుక్కలు డెలివరీ బాయ్ను కరిచాయి. దీనిపై బాధితుడు సల్మాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుక్కల యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.