స్విట్జర్లాండ్లోని జెనీవా వేదికగా జరిగిన ఇంటర్- పార్లమెంటరీ యూనియన్ 148వ సమావేశంలో పాకిస్థాన్ ప్రతినిధి మాట్లాడారు. జమ్మూకశ్మీర్, లద్దాఖ్లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆరోపించారు. ఈ సమావేశంలో
భారత్ తరపున పాల్గొన్న రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్.. ‘రైట్ టు రిప్లై’ అవకాశం కింద స్పందించారు. ప్రజాస్వామ్యంపై పాకిస్థాన్ పాఠాలు చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఉగ్ర ఫ్యాక్టరీలను ఆపడంపై ఆ దేశం దృష్టిపెట్టాలన్నారు.