శ్రీసత్యసాయి జిల్లా నల్లమాడ మండలంలో సోమవారం దారుణం చోటు చేసుకుంది. కుటాలపల్లిలో టీడీపీ కార్యకర్త అమర్నాథరెడ్డిని కొందరు దుండగులు దారుణంగా హతమార్చారు. పొలంలో నిద్రిస్తున్న అమర్నాథ రెడ్డిని వేట కొడవళ్లతో నరికి చంపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.