బీహార్లోని గోపాల్గంజ్ లోక్సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సత్యేంద్ర బైతా గాడిదపై ఎక్కి ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. అతను గోపాల్గంజ్ శ్యాంపూర్ గ్రామానికి చెందినవాడు. తన లోక్సభ నామినేషన్ పత్రాలను దాఖలు చేసేందుకు గాడిదపై వెళ్లి అందరి దృష్టిని ఆకర్షించారు. పెట్రోలో, డీజిల్ ధరలు ఎక్కువగా ఉండటం వల్ల ఇలా గాడిదపై ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.