ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. ఆప్ ఏడుగురు ఎమ్మెల్యేలను కొనేందుకు
బీజేపీ ప్రయత్నించిందని, పార్టీ మారిన వారికి రూ.25 కోట్లు ఇస్తామని ఆపర్ చేసిందని ఆరోపించారు. ఇప్పటికీ
బీజేపీ ఎమ్మెల్యేలు చర్చలు జరుపుతున్నారని అన్నారు. అలాగే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తనని అరెస్ట్ చేస్తామని బెదిరింపులకు పాల్పడుతోందని తెలిపారు.