ఎఫ్‌టిఎల్ లో నిర్మాణాలకు అనుమతినిచ్చిన ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసుల నమోదుకు 'హైడ్రా' సిద్ధం

544చూసినవారు
ఎఫ్‌టిఎల్ లో నిర్మాణాలకు అనుమతినిచ్చిన ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసుల నమోదుకు 'హైడ్రా' సిద్ధం
ఎఫ్‌టిఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై దృష్టి పెడుతూనే అనుమతులు ఇచ్చిన అధికారులపై వేటు వేసేందుకు హైడ్రా సిద్ధమైంది. ఈ మేరకు ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ కు హైడ్రా సిఫారసు చేసింది. ఈ జాబితాలో జీహెచ్ఎంసీ చందానగర్ డిప్యూటీ కమిషనర్, హెచ్ఎండీఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్, నిజాంపేట మున్సిపల్ కమిషనర్, బాచుపల్లి ఎమ్మార్వో సహా ఓ సర్వేయర్ ఉన్నట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్