మధ్యప్రదేశ్లో బుధవారం భూకంపం సంభవించింది. సియోని ప్రాంతంలో భూప్రకంపనలు వచ్చాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 3.6గా నమోదు అయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం లేదు. దీని గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.