మధ్యప్రదేశ్లోని ఖాండ్వాలో శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.6గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. ఉదయం 9.04 గంటలకు భూప్రకంపనలు రావడంతో హౌసింగ్ బోర్డ్ కాలనీ, కీర్తి నగర్, నవ్కర్ నగర్, ఆనంద్ నగర్, మాతా చౌక్, గుల్మోహర్ కాలనీల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. అయితే భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం లేదు.