దేశ ప్రధానిపై మాల్దీవుల మంత్రులు చేసిన తీవ్ర విమర్శల నేపథ్యంలో దేశీయ ప్రయాణ సంస్థ ఈజ్మైట్రిప్ ఎక్స్ వేదికగా కీలక నిర్ణయం ప్రకటించింది. ఆ దేశానికి ఫ్లైట్ బుకింగ్స్ నిలిపివేయాలని సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన నిషాంత్ పిట్టి ఎక్స్లో పోస్టు చేశారు. ఈజ్మైట్రిప్ సంస్థ ఢిల్లీ కేంద్రంగా ఆన్లైన్ టికెట్ బుకింగ్ సేవలందిస్తోంది. ఆ దేశ ప్రభుత్వం విమర్శలు చేసిన ముగ్గురు మంత్రులను ఇప్పటికే సస్పెండ్ చేసింది.