అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థిని నితీశా కందుల(23) క్షేమంగానే ఉంది. ఆమెను సురక్షితంగా గుర్తించినట్లుగా శాన్బెర్నార్డినో పోలీసులు వెల్లడించారు. నితీశా గత నెల 28 నుంచి కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ఆమె చివరిగా లాస్ ఏంజెల్స్లో కాలిపోర్నియా నంబర్ ప్లేట్తో ఉన్న టయోటా కారును.. గత నెల 30న నడుపుతూ కనిపించిందని చెప్పటంతో క్షేమంగా గుర్తించారు.