దిలీప్ ఘోష్, సుప్రియ శ్రీనేత్‌కు ఈసీ వార్నింగ్

71చూసినవారు
దిలీప్ ఘోష్, సుప్రియ శ్రీనేత్‌కు ఈసీ వార్నింగ్
మహిళలను కించపరచే విధంగా వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్, కాంగ్రెస్ నేత సుప్రియ శ్రీనేత్‌ను ఎలక్షన్ కమిషన్ సోమవారం మందలించింది. వారికి షోకాజ్ నోటీసులు పంపింది. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కంగనా రౌనౌత్‌లను కించపరచే విధంగా వారిరువురూ వ్యాఖ్యలు చేసినట్టు ఈసీ నిర్ధారించింది. ఎన్నికల ప్రచార సమయంలో రాజకీయ పార్టీలు హుందాగా వ్యవహరించాలని సూచించింది. గత మార్చి 16 నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్