రాజకీయ స్వార్థం కోసం సీఎం జగన్ పింఛనర్ల పొట్టకొట్టారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. "ఒకటో తేదీన పెన్షన్ ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైంది. ఆ నెపాన్ని టీడీపీ, ఎన్నికల కమిషన్పై నెడుతున్నారు. పెన్షన్లు పంపిణీ చేయొద్దని టీడీపీ ఎవరినీ కోరలేదు. వైసీపీ కుట్రలను ఇంటింటికి వెళ్లి తెలియజేయాలి. ఖజానా ఖాళీ చేసి పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చారు." అని చంద్రబాబు మండిపడ్డారు.