ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబర్ మరోసారి వార్తల్లో నిలిచింది. హైదరాబాద్కు చెందిన ఫుడ్ వ్లాగర్ శ్రీరాజ్ నీలేష్ తన భార్యతో కలిసి బెంగళూరులో ఉబర్ ఆటోలో ప్రయాణించాడు. వీరు కేఆర్పురంలోని టిన్ ఫ్యాక్టరీ నుంచి కోరమంగళ వెళ్లేందుకు ఉబర్లో ఆటో బుక్ చేసుకున్నారు. అయితే, ఆటో బుక్ చేసుకునే సమయంలో వారికి పది కిలోమీటర్ల దూరానికి కేవలం రూ.207 మాత్రమే చూపించింది. గమ్యస్థానానికి చేరుకుని బిల్లు చూడగా.. రూ.కోటికిపైనే ఉంది.