హైదరాబాలో 5 లక్షలకు పైగా ఓట్లు తొలగించిన ఈసీ

68చూసినవారు
హైదరాబాలో 5 లక్షలకు పైగా ఓట్లు తొలగించిన ఈసీ
దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న వేళ, నకిలీ ఓట్ల ఏరివేతపై దృష్టిసారించింది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌. ఒక్క హైదరాబాద్ లోని జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 5 లక్షల 41 వేల 201 ఓట్లను తొలగించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌రాస్ వెల్లడించారు. ఇందులో చనిపోయిన వ్యక్తులు 47 వేల 141 ఓట్లు, చిరునామా మార్పులో 4 లక్షల 39 వేల 801 ఓట్లు, డూప్లికేట్‌లో 54 వేల 259 ఓట్లు తొలగించినట్లు స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్