ఏపీలో హింసపై ఈసీ సీరియస్

2207చూసినవారు
ఏపీలో హింసపై ఈసీ సీరియస్
ఏపీలో ఎన్నికల రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక సంఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఇప్పటికే ఏపీ డీజీపీ, సీఎస్‌తో భేటీ తర్వాత కఠిన చర్యలకు ఉపక్రమించింది. రెండు జిల్లాల ఎస్పీలతోపాటు కింది స్థాయి అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. అంతేకాకుండా మరికొందరు అధికారులపైనా కొరడా ఝళిపించింది. ఇక ఈ హింసాత్మక ఘటనలపై సిట్ ఏర్పాటు చేసిన ఈసీ.. రెండు రోజుల్లో నివేదిక అందించాలని ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్