వాయు కాలుష్యం ఎఫెక్ట్.. రోజూ 2 వేల మంది చిన్నారుల బలి

60చూసినవారు
వాయు కాలుష్యం ఎఫెక్ట్.. రోజూ 2 వేల మంది చిన్నారుల బలి
వాయుకాలుష్యం వల్ల తలెత్తే అనారోగ్య సమస్యలతో ప్రతి రోజూ ప్రపంచవ్యాప్తంగా 2 వేల మంది చిన్నారులు చనిపోతున్నారని తాజా నివేదికలో వెల్లడైంది. 2021లో వాయుకాలుష్యం కారణంగా 81 లక్షల మంది మరణించినట్లు ఈ అధ్యయనం తేల్చింది. ఈ మేరకు అమెరికాలోని హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్‌స్టిట్యూట్ జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అత్యధిక మరణాలకు కారణమవుతున్న అంశాల్లో బీపీ తరువాత స్థానంలో వాయు కాలుష్యం నిలిచింది.

సంబంధిత పోస్ట్