భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, నలుగురికి గాయాలు (వీడియో)

83చూసినవారు
ఢిల్లీలోని బోలానాథ్‌ నగర్‌లో ఓ భవనంలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, నలుగురు వ్యక్తులు తీవ్ర గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతులను షిల్పి(42), ప్రణవ్‌ (19)లుగా పోలీసులు గుర్తించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్