చిత్తూరులో ఏనుగు హల్ చల్.. భయాందోళనలో వాహనదారులు

72చూసినవారు
చిత్తూరులో ఏనుగు హల్ చల్.. భయాందోళనలో వాహనదారులు
చిత్తూరులో ఓ ఏనుగు రోడ్డుపై హల్ చల్ చేసింది. ఆదివారం ఉదయం పలమనేరు ఆంజనేయ స్వామి గుడి వద్దకు ఓ ఏనుగు వచ్చింది. దాన్ని చూసి స్థానికులు భయాందోళన చెందారు. అది పలమనేరు వద్ద బెంగళూరు - చెన్నై జాతీయ రహదారిని దాటడానికి ప్రయత్నించింది. వాహనాల రద్దీ కారణంగా రోడ్డు దాటలేకపోవడంతో అక్కడే తిష్ట వేసింది. ఏనుగును వీడియోలు తీసి కొందరు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఈ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్