నేడు 25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ లడఖ్ లోని ద్రాస్ సెక్టార్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాడు కార్గిల్ యుద్ధ సమయంలో ఓ సామాన్యుడిలా సైనికుల మధ్య ఉన్నానని వెల్లడించారు. దేశం కోసం సైనికులు చేసిన వీరోచిత పోరాటం తన మదిలో నిలిచిపోయిందని అన్నారు.