బాణసంచా గోడౌన్‌లో పేలుడు.. ఐదుగురు మృతి (వీడియో)

54చూసినవారు
యూపీలోని ఫిరోజాబాద్ జిల్లాలో గత రాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. షికోహాబాద్ ప్రాంతం నౌషెరా గ్రామంలోని బాణసంచా గోడౌన్‌లో అగ్నిప్రమాదం జరిగింది. భారీ పేలుడు ధాటికి ఆ ప్రాంతంలోని 10కి పైగా ఇళ్లు దగ్ధమయ్యాయి. ఈ దుర్ఘటనలో మూడేళ్ల చిన్నారి సహా నలుగురు చనిపోయారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న 10 మందిని SDRF బృందాలు రక్షించాయి. ప్రస్తుతం రెస్క్కూ పనులు కొనసాగుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్