ఉత్తరాఖండ్లోని సిల్క్యరా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను కాపాడేందుకు భారీ ఆపరేషన్ చేపట్టారు. సొరంగంలోకి చేరేందుకు దాదాపు ఆరు మార్గాల్లో ప్రత్యామ్నాయాలను అన్వేషించారు. అత్యంత సాంకేతికత యంత్రాలను వినియోగించినప్పటికీ.. చివరకు నేలకు సమాంతరంగా 'ర్యాట్ హోల్ మైనింగ్ చేపట్టి కార్మికులు ఉన్న ప్రాంతానికి చేరుకోగలిగారు. గనిలో అమర్చిన ఓ పైపు ద్వారా కార్మికులను ఒక్కొక్కరిగా బయటకు తీసుకువచ్చారు.