బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రేపటికి ఈ అల్పపీడనం వాయుగుండంగా మారనుంది. అలాగే ఈ నెల 25న తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ వాయుగుండం తుపానుగా రూపాంతరం చెందితే దీనికి ‘రెమాల్’గా నామకరణం చేశారు. మరో పక్క బెంగాల్ తీరంలో 26న తీవ్రమైన తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.