దేశంలో రికార్డ్ స్థాయిలో అమాంతం పెరిగిన పన్ను వసూళ్లు ప్రభుత్వ ఖజానాను నింపివేస్తున్నాయి. ఇది వరకు ఎప్పుడూ లేని విధంగా ప్రస్తుత ఏడాది ఏప్రిల్లో వస్తు సేవల పన్ను వసూళ్లు రూ.2 లక్షల కోట్ల మార్క్ను దాటాయి. గతేడాది ఏప్రిల్తో పోల్చితే గడిచిన నెలల్లో ప్రభుత్వాలకు జిఎస్టి రాబడి రూ.2.10 లక్షల కోట్లకు చేరింది. దేశీయ లావాదేవీలు, దిగుమతుల్లో బలమైన వృద్థి, జిఎస్టి వసూళ్లు పెరగడానికి కారణమని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.