వాలంటీర్లకు డెడ్ లైన్..!

45663చూసినవారు
వాలంటీర్లకు డెడ్ లైన్..!
ఏపీలో ఎన్నికల వేళ వాలంటీర్ల చర్చ ఏదో విధంగా జరుగుతూనే ఉంది. పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను దూరం పెడుతూ ఈసీ నిర్ణయం తీసుకున్నాక రాష్ట్రంలో వారంతా రాజీనామాల బాట పట్టారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి ఒకరు వాలంటీర్ల‌కు వార్నింగ్ ఇచ్చారు. వాలంటీర్లు వెంటనే రాజీనామాలు చేసి వైసీపీ ప్రచారంలోకి రావాలని టెక్కలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి దువ్వాడ శ్రీనివాస్ సూచించారు. తాను చెప్పిన విధంగా నడుచుకునే వాలంటీర్లు మాత్రమే కొనసాగుతారని, ఇప్పటీ వరకు రాజీనామా చెయ్యకుండా, పార్టీ కండువా వేసుకోకుండా ఉండే వాలంటీర్ ఉంటే ఇకపై వారు తమ పార్టీ కోసం పనిచేయరని తేల్చేశారు.

సంబంధిత పోస్ట్