జూన్ 1 నుంచి
టీ20 ప్రపంచకప్ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. 9న
భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్స్ తన సోషల్ మీడియాలో
భారత్-పాక్ మ్యాచ్కు సంబంధించిన పోస్టర్ను విడుదల చేసింది. అయితే, ఇందులో టీమిండియా కెప్టెన్గా హార్దిక్ పాండ్యాను చూపించింది. దీంతో నెట్టింట రోహిత్ శర్మ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. అంతేకాదు అసలు మీకెవడు హార్దిక్ పాండ్యా కెప్టెన్ అని చెప్పారని కామెంట్స్ పెడుతున్నారు.