పశ్చిమ బెంగాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నదియా జిల్లా లక్ష్మీగచ్ఛా ప్రాంతంలో ఓ కారు అదుపుతప్పి మూడు ఈ రిక్షాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మరణించగా మరికొంతమందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.