TG: హైదరాబాద్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. స్వప్న అనే మహిళా వరకట్న వేధింపులు తాళలేక ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. స్వప్న అనే మహిళను కర్ణాటకకు చెందిన ఆమ్రేష్ అనే వ్యక్తికి ఇచ్చి 2022లో పెళ్లి చేశారు. కొంతకాలం నుంచి అదనపు కట్నం కోసం ఆమ్రేష్ వేధిస్తున్నాడు. దీంతో మనస్థాపం చెందిన స్వప్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.