ఫెమా కేసు.. డీఎంకే ఎంపీకి రూ.908 కోట్ల జరిమానా!

59చూసినవారు
ఫెమా కేసు.. డీఎంకే ఎంపీకి రూ.908 కోట్ల జరిమానా!
తమిళనాడులోని అధికార డీఎంకే ఎంపీ ఎస్‌.జగత్రక్షకన్‌కు భారీ షాక్‌ తగిలింది. విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనల ఉల్లంఘన కేసులో ఎంపీతో పాటు ఆయన కుటుంబానికి రూ.908 కోట్ల జరిమానా విధించినట్లు ఈడీ తెలిపింది. ఫెమా చట్టంలోని 37A సెక్షన్‌ ప్రకారం 2020 సెప్టెంబర్‌లో సీజ్‌ చేసిన రూ.89.19 కోట్ల మొత్తాన్ని జప్తు చేసినట్లు తెలిపింది. ఈ నెల 26న వచ్చిన తీర్పు మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది.