ప్రముఖ నటుడు, బీజేపీ గోరఖ్పూర్ ఎంపీ రవికిషన్ శుక్లాను తన కుమార్తెకు తండ్రిగా ఆరోపించిన మహిళ అపర్ణ ఠాకూర్తో సహా ఆరుగురిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. రవికిషన్ భార్య ప్రీతి శుక్లా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు హజ్రత్గంజ్ పోలీసులు తెలిపారు. అండర్ వరల్డ్తో తనకు సంబంధాలున్నాయని అపర్ణ ఠాకూర్ తనను బెదిరించిందని, రూ.20 కోట్లు ఇవ్వకుంటే అత్యాచారం కేసు పెట్టి రవికిషన్ను బజారుకు ఈడుస్తానని హెచ్చరించినట్టు ఎంపీ భార్య ఫిర్యాదులో ఆరోపించారు.