కారులో చెలరేగిన మంటలు.. ముగ్గురు సేఫ్ (వీడియో)

85చూసినవారు
ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఢిల్లీ మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేపై కదులుతున్న వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు కారులో ఉన్న ముగ్గురు యువకులను సురక్షితంగా రక్షించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.