రుణం చెల్లించలేదని రైతు పొలంలో ఫ్లెక్సీ.. మంత్రి తుమ్మల ఫైర్

70చూసినవారు
రుణం చెల్లించలేదని రైతు పొలంలో ఫ్లెక్సీ.. మంత్రి తుమ్మల ఫైర్
బ్యాంకు లోన్ కట్టలేదని రైతు భూమిని వేలం వేస్తామని బ్యానర్లు కట్టిన డీసీసీబీ బ్యాంక్ పై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పొల్కంపేటలో రైతు రాజశేఖర్ పొలంలో ఫ్లెక్సీల కట్టడంపై ఆయన స్పందించారు. 2010లో రైతుకు రుణం మంజూరు చేశారు. రుణం చెల్లించకపోవడం, తనఖాలోని భూమిని ఇతరులకు విక్రయించాడనే ఫ్లెక్సీలు పెట్టినట్లు బ్యాంక్ అధికారులు తెలిపారు. దీంతో ఇలాంటి పద్ధతులను తాము ఉపేక్షించమని మంత్రి హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్