ట్రంప్ను ఎట్టిపరిస్థితుల్లోనూ గెలవనీయొద్దని భారత్లో జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు సహా ఇతర సమావేశాల్లో ప్రపంచ నేతలు తనతో చెప్పారని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. మళ్లీ ట్రంప్ గెలిస్తే తమ దేశాల్లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని వారు చెప్పారని తెలిపారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి నిధి సేకరణకు సంబంధించి న్యూయార్క్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.