తమిళనాడు మాజీ సీఎం, అన్నాడీఎంకే బహిష్కృత నేత పన్నీర్సెల్వం ఉనికి కోసం పోరాడుతున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో రామనాథపురం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బీజేపీ కూడా ఇక్కడ అభ్యర్థిని నిలబెట్టకుండా వ్యూహాత్మకంగా పన్నీర్ కు మద్దతు ప్రకటించింది. దీంతో ఆ స్థానం తమిళనాడులో హాట్ టాపిక్గా మారింది. అన్నాడీఎంకేలోని చీలిక వర్గంతోపాటు బీజేపీ మద్దతుతో సులువుగా విజయం సాధిస్తానని పన్నీర్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.