శ్రీసత్యసాయి జిల్లాలో భారీగా బంగారం పట్టివేత

61చూసినవారు
శ్రీసత్యసాయి జిల్లాలో భారీగా బంగారం పట్టివేత
ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీసత్యసాయి జిల్లా కొడికొండ చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా రూ. 80 కోట్లు విలువైన బంగారు ఆభరణాలు, వజ్రాలను పట్టుకున్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న క్రమంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే పట్టుబడ్డ బంగారం, వజ్రాలు మలబార్ గోల్డ్ కంపెనీకి చెందినవిగా పోలీసులు గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్