ఆర్జేడీ నేత, బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ లోక్సభ ఎన్నికల చివరి దశ పోలింగ్లో భాగంగా పాట్నాలోని వెటర్నరీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తేజస్వీ తన సహాయకుని సహకారంతో కారులో నుంచి దిగి.. వీల్ చైర్లో పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఓటు వేశారు. ఆయన ఆరోగ్యంపై ఆర్జేడీ పార్టీ కానీ, ఆయన కానీ ఇంతవరకు స్పందించలేదు.