కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్ కీలక ప్రకటన చేశారు. తన 18 ఏళ్ల ప్రజాసేవ, రాజకీయాల నుంచి విరమిస్తున్నట్టు ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. రాజకీయాల నుంచి తప్పుకున్నప్పటికీ పార్టీ కోసం పని చేస్తూనే ఉంటానని ఆయన ఎక్స్లో ట్వీట్ చేశారు. కాగా, 2024 లోక్సభ ఎన్నికల్లో కేరళలోని తిరవనంతపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రాజీవ్ చంద్రశేఖర్ కాంగ్రెస్ నుంచి అభ్యర్థి శశి థరూర్ చేతిలో ఓడిపోయారు.