వేసవి వాలీబాల్ శిక్షణ శిబిరాన్ని సందర్శించిన లక్ష్మయ్య

267చూసినవారు
వేసవి వాలీబాల్ శిక్షణ శిబిరాన్ని సందర్శించిన లక్ష్మయ్య
అచ్చంపేట సాంఘిక సంక్షేమం గురుకుల పాఠశాలలో కొనసాగుతున్న వేసవి వాలీబాల్ శిక్షణ శిబిరాన్ని క్రీడా అధికారి జె. రామ్ లక్ష్మయ్య బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న విద్యార్థులకు పలు సలహా, సూచనలు చేశారు. ఆటల్లో రాణించే వారికి ప్రత్యేక గుర్తింపు ఉంటుందని తెలిపారు. శిక్షణ శిబిరాలు ప్రత్యేక క్రీడా నైపుణ్యాలు నేర్చుకోవడానికి తోడ్పడతాయని పేర్కొన్నారు. విద్యార్థుల ఆట తీరును పరీక్షించి ప్రశంసించారు. పతకాలే లక్ష్యంగా నైపుణ్యాలను నేర్చుకొని కృషి చేయాలన్నారు. ఆర్ఎస్సి వెంకటేశ్వర్లు, సూపర్డెంట్ మనోహర్, మహేష్, మషన్న, శిక్షకులు శివకుమార్, సెంటిల్నాతన్, వినోద్, రమేష్ శ్రీనివాస్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్