నాగర్ కర్నూల్ బయలుదేరిన బీఆర్ఎస్ శ్రేణులు

874చూసినవారు
నాగర్ కర్నూల్ బయలుదేరిన బీఆర్ఎస్ శ్రేణులు
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నూతన కలెక్టర్, ఎస్పీ కార్యాలయం తోపాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు విచేయుచున్న సందర్భంగా పదర మండలంలోని వంకేశ్వరం, చిట్లంకుంట, చెన్నంపల్లి, మారడుగు, మద్దిమడుగు, పెట్రోల్ చెన్, రాయలగండి గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో యువకులు పెద్దలు కార్యకర్తలు, అభిమానులు బయలుదేరారు. ఈ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగపతి రాజు యాదవ్ జండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గోలి శ్రీనివాసులు, గ్రామ అధ్యక్షుడు బీనమోని నారయ్య, మాజీ సర్పంచ్ రాయ శ్రీనివాసులు, ఎంపిటిసిలు సునీత శ్రీనివాసులు, గొల్లం ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్