నాగర్ కర్నూల్ జిల్లా పదర మండల నూతన తహసిల్దార్గా తబితా రాణి సోమవారం బాధ్యతలు చేపట్టారు. తెలకపల్లి మండలంలో గత ఏడాదిగా విధులు నిర్వహించిన ఆమె బదిలీపై ఇక్కడికి వచ్చారు. గత నాలుగు సంవత్సరాలుగా పదర మండలంలో విధులు నిర్వహించిన తహసిల్దార్ కృష్ణయ్య తెలకపల్లి మండలానికి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ.. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను తెలుసుకొని పరిష్కరించేలా కృషి చేస్తానని తెలిపారు.