ఘనంగా మిలాద్- -ఉన్- నబీ ర్యాలీ

62చూసినవారు
నారాయణపేట పట్టణంలో గురువారం మిలాద్-ఉన్- నబీ ర్యాలీ ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. ప్రధాన రహదారుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఒకరిని ఒకరు కలుసుకొని పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షులు శివకుమార్ రెడ్డి ముస్లిం సోదరులను కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ర్యాలీ సందర్భంగా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్