చాక్లెట్ దొరికినంత ఈజీగా గంజాయి దొరుకుతుంది: BJP ఎమ్మెల్యే

63చూసినవారు
చాక్లెట్ దొరికినంత ఈజీగా గంజాయి దొరుకుతుంది: BJP ఎమ్మెల్యే
సుల్తానాబాద్ అత్యాచార ఘటనతోనైనా CM రేవంత్‌ రెడ్డికి కనువిప్పు కలగాలని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు అన్నారు. ఇంటి తగాలతో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కుంటుపడిందని, మంత్రివర్గాన్ని కూడా విస్తరించలేని స్థితిలో సీఎం ఉన్నారని అన్నారు. తెలంగాణకు హోంమంత్రి లేకపోవడం వల్లే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని ఫైర్ అయ్యారు. ఢిల్లీకి డబ్బులు పంపించే పనిలో రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.