మహారాష్ట్ర వసాయ్ సమీపంలోని మానిక్పూర్ ప్రాంతంలో ఆదివారం విషాద ఘటన జరిగింది. ఓ ఇంట్లో నుంచి గ్యాస్ వాసన రావడంతో స్థానికులు అప్రమత్తం అయ్యారు. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తలుపులు బద్దలుగొట్టి లోపలకు వెళ్లగా ముగ్గురు విగతజీవులుగా కనిపించారు. గ్యాస్ లీక్ వల్ల ఊపిరి ఆడక వారు చనిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.