షాపులో ఉన్న వ్యక్తిపై దొంగలు దాడి, చోరీ (Video)

50చూసినవారు
పంజాబ్‌లోని మోగా జిల్లాలో దారుణ సంఘటన జరిగింది. సెప్టెంబర్ 18న డునెకే ప్రాంతంలోని స్నేహితుడు షంషేర్ ఖాన్‌ను కలిసేందుకు రాజేష్‌ కుమార్‌ అతడి షాపు వద్దకు వెళ్లాడు. అయితే తనకు అత్యవసర పని ఉందని చెప్పిన ఖాన్‌, రాజేష్‌ను ఆ షాపులో కూర్చొమని చెప్పాడు. కాగా, కొంత సేపటి తర్వాత ముఖానికి ముసుగులు వేసుకున్న ఐదుగురు వ్యక్తులు రెండు బైకులపై ఆ షాప్‌ వద్దకు చేరుకుని, రాజేష్‌ కుమార్‌పై కర్రలు, కత్తులతో దాడి చేశారు. చివరకు దొంగలు కౌంటర్‌లోని క్యాష్‌, రాజేష్‌ మొబైల్‌ను తీసుకుని పారిపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్