అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్

79చూసినవారు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్
శబరిమలలో ఇకపై రోజుకు 50వేల మంది అయ్యప్ప భక్తులను వర్చువల్ క్యూ ద్వారా దర్శనానికి అనుమతించాలని నిర్ణయించింది. ఈ భక్తులకు ఇన్సూరెన్స్ పాలసీని అందిస్తామంది. ఇన్సూరెన్స్ పాలసీ కోసం రూ.10 వసూలు చేయనున్నట్లు పేర్కొంది. భక్తులకు ఇన్సూరెన్స్ కవరేజ్ పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలిపింది. మొదట్లో 80 వేల మంది భక్తులను అనుమతించాలని నిర్ణయించినా కొన్ని పరిమితుల వల్ల 50 వేలకు కుదించామని వెల్లడించింది.

ట్యాగ్స్ :