రేషన్ కార్డుదారులకు శుభవార్త

191336చూసినవారు
రేషన్ కార్డుదారులకు శుభవార్త
రేషన్ కార్డు ఉన్నవారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే రేషన్ కార్డుదారులకు రాగులు, జొన్నలు పంపిణీ చేస్తుండగా, త్వరలోనే కొర్రల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్రంలో కొర్రలు పండించే రైతుల నుండి కొనుగోలు చేసి తిరిగి ప్రజలకు సరఫరా చేయనుంది. అలాగే, ప్రస్తుతం పట్టణాల్లో పంపిణీ చేస్తున్న గోధుమ పిండిని గ్రామాల్లోనూ పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సర్వే నిర్వహించనుంది.