దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు SBI తన కోట్లాది మంది ఖాతాదారులకు శుభవార్త అందించింది. 180 రోజుల నుంచి 210 రోజులు, 211 రోజుల నుంచి ఒక సంవత్సరం కంటే తక్కువ కాలపరిమితి గత ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీని పెంచింది. SBI ఈ ఎఫ్ఢీలపై వడ్డీని 0.25 శాతం పెంచింది. ఈ కొత్త రేట్లు జూన్ 15 నుంచి అమల్లోకి వచ్చాయి.