లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవలే నవీన్ జిందాల్ కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరగా, ఇప్పుడు అతని తల్లి సావిత్రి జిందాల్ కాంగ్రెస్ను వీడుతున్నట్లు ప్రకటించారు. భారతదేశంలోని అత్యంత సంపన్న మహిళల జాబితాలో సావిత్రి జిందాల్ పేరు అగ్రస్థానంలో ఉంది. ప్రపంచ బిలియనీర్ల జాబితాలో సావిత్రి జిందాల్ 56వ స్థానంలో ఉన్నారు.