తనపై హైదరాబాద్లోని నార్సింగి పోలీస్ స్టేషన్లో అత్యాచార కేసు నమోదు కావడంపై ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి తొలిసారిగా సోషల్ మీడియాలో స్పందించారు. ‘డబ్బు కోసమే ఆమె నాపై నిందలు వేస్తోంది. త్వరలోనే నిజనిజాలు బయటకు వస్తాయి. నా అడ్వకేట్ అన్ని వివరాలు తెలియజేస్తారు. నేనేంటో నాకు, నా ఫాలొవర్స్కు తెలుసు.’ అని హర్షసాయి ఇన్స్టాలో పోస్టు పెట్టారు. మరోవైపు నార్సింగి పోలీసులు హర్షసాయి కోసం గాలిస్తున్నారు.