హాథ్రస్‌ తొక్కిసలాట ఘటన.. నిర్వాహకులదే తప్పు: సిట్

79చూసినవారు
హాథ్రస్‌ తొక్కిసలాట ఘటన.. నిర్వాహకులదే తప్పు: సిట్
యూపీలోని హాథ్రస్‌లో జరిగిన తొక్కిసలాటపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఇప్పటి వరకు 90 మంది వాంగ్మూలాలను నమోదు చేసినట్లు సిట్ కు నేతృత్వం వహిస్తున్న ఏడీజీ అనుపమ్ కురుక్షేత్ర తెలిపారు. కార్యక్రమ నిర్వాహకులదే తప్పిదమని ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు సూచిస్తున్నాయని ఓ వార్త సంస్థకు వెల్లడించారు. సిట్ ప్రాథమిక నివేదికను సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ఇప్పటికే అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్